సివిల్స్ పరీక్షలకు ప్రత్యేక అధికారులు


Ens Balu
2
Anantapur
2020-10-03 18:54:29

యూపీఎస్సీ పరీక్షల కోసం లైజన్ ఆఫీసర్లను నియమించినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడారు. సివిల్స్ పరీక్షల కోసం 10 మంది లోకల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ లను, 10 మంది రూట్ ఆఫీసర్స్ కమ్ సిట్టింగ్ స్క్వాడ్ లను, 10 మంది అసిస్టెంట్ సూపర్వైజర్ లను, 10 మంది . అలాగే 320 మంది ఇన్విజిలేటర్ లను నియమించినట్లు తెలిపారు. అనంతపురం కేంద్రంలోని అన్ని వెన్యూ పరీక్ష కేంద్రాలలో ఇన్విజిలేటర్ల కు ఇన్విజిలేషన్ డ్యూటీ లపై వెన్యూ సూపర్వైజర్లు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. యూపీఎస్సీ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన వెన్యూ పరీక్ష కేంద్రాలలో ఎలాంటి ఫోన్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయకుండా జామర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. యూపీఎస్సీ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన వెన్యూ పరీక్ష కేంద్రాలలో   ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయాలని, శానిటైజర్లు, మాస్కులు,గ్లోవ్స్ సిద్ధంగా ఉంచాలని, అదనపు గదులను శుభ్రపరచి, శానిటైజేషన్ చేసి అవసరమైన ఫర్నిచర్ ను ఏర్పాటు చేయాలన్నారు. గోడలపై ఉన్న రాతలు తొలగించాలని,  గదులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఆయా గదుల్లో గాలి, వెలుతురు ఉండేలా చూడాలన్నారు. అభ్యర్థుల కోసం తాగునీటి సౌకర్యాలను కల్పించాలన్నారు. వైద్య బృందాలను తగినన్ని మందులను కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలన్నారు..  పరీక్షా కేంద్రాల వద్ద ఒక వైపుగా స్నాక్స్, బిస్కట్ లాంటి ఆహార  పదార్థాలను అభ్యర్థులకు అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ సూచించారు.. యూపీఎస్సీ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం యూపీఎస్సీ పరీక్షలను ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు, లైజన్ ఆఫీసర్లను  జిల్లా కలెక్టర్ ఆదేశించారు.