ఏఈఓల సంఘం జిల్లా అధ్యక్షునిగా సత్యన్నారాయణ..
Ens Balu
3
అనకాపల్లి
2020-10-04 13:57:07
వ్యవసాయ విస్తరణాధికారుల సమస్యలు పరిష్కరించడంలో శక్తివంచన లేకుండా క్రుషి చేస్తానని విశాఖజిల్లా వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం నూతన అధ్యక్షులు కెవి సత్యన్నారాయణ చెప్పారు. ఆదివారం అనకాపల్లిలో జరిగిన కార్యక్రమంలో సంఘం నూతన అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సత్యన్నారాయణ మాట్లాడుతూ, వ్యవసాయశాఖలో ఎప్పటి నుంచో విధులు నిర్వహిస్తున్న ఏఈఓల సమస్యలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతానని చెప్పారు. ఏఈఓలంతా సమిష్టిగా ఒకేతాటిపై ఉంటే ఎలాంటి సమస్యనైనా..డిమాండ్లనైనా సాధించుకోవచ్చునని అన్నారు. ఎప్పటికప్పుడు జిల్లా అంతా పర్యటించి ఏఈఓల స్థితిగతులను తెలుసకొని సంఘం అభివ్రుద్ధికి కూడా క్రుషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా వ్యవసాయ విస్తరణా అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.