రేపటి మంత్రి బొత్స కార్యక్రమాలన్నీ రద్దు


Ens Balu
1
Vizianagaram
2020-10-04 20:53:30

రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సోమ‌వారం జిల్లాలో పాల్గొనాల్సి వున్న కార్య‌క్ర‌మాల‌న్నీ ర‌ద్ద‌యిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. భోగాపురం, గ‌జ‌ప‌తిన‌గ‌రం, కొత్త‌వ‌ల‌స మండ‌లాల్లో మంత్రి పాల్గొనాల్సిన కార్య‌క్ర‌మాల‌న్నీ ర‌ద్ద‌యిన‌ట్లు పేర్కొన్నారు. వి.ఎం.ఆర్‌.డి.ఏ. ఛైర్మ‌న్ ద్రోణంరాజు శ్రీ‌నివాస్ మృతికి సంతాప సూచ‌కంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. జిల్లాలో భీమ‌సింగి చ‌క్కెర క‌ర్మాగారాన్ని సంద‌ర్శించాల్సి వున్న మంత్రుల బృందం ప‌ర్య‌ట‌న కూడా వాయిదా ప‌డింద‌ని వెల్ల‌డించారు. అయితే మ‌ధ్యాహ్నం 3-00 గంట‌ల‌కు క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో గ్రామాల్లో నిర్మాణంలో వున్న స‌చివాల‌య భ‌వ‌నాలు, రైతుభ‌రోసా కేంద్రం, ఆరోగ్య‌కేంద్రాల భ‌వ‌న నిర్మాణాల ప్ర‌గ‌తిపై స‌మీక్షించేందుకు క‌లెక్ట‌ర్ కార్యాల‌య ఆడిటోరియంలో మంత్రి ఒక స‌మీక్ష స‌మావేశంలో పాల్గొంటార‌ని వెల్ల‌డించారు. జిల్లాకు చెందిన శాస‌న‌స‌భ్యులు, ఆయా ఇంజ‌నీరింగ్ శాఖ‌ల ఎస్‌.ఇ., ఇ.ఇ., డి.ఇ., ఏ.ఇ.లంతా ఈ స‌మావేశంలో పాల్గొంటార‌ని పేర్కొన్నారు.