ప్రజాసేవకు అంకితమైన మహామనిషి ద్రోణం..


Ens Balu
2
Visakhapatnam
2020-10-05 12:38:58

ఉత్తరాంధ్రాలో ప్రభుత్వ అధికారులను ఆత్మీయులుగా స్వయంగా పేరుపెట్టి పిలిచే ఏకైక నాయకుడు ద్రోణంరాజుశ్రీనివాస్ మాత్రమేనని విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రభుత్వ ఉద్యోగల ఫెడరేషన్ కన్వీనర్ పోలాకి శ్రీనివాసరావు అన్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్ అకాల మరణం తమను ఎంతగానో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనే మంచి నాయకులు ఇక లేరనే విషయం విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని అన్ని రాజకీయపార్టీలు, ప్రభుత్వ ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. ఆయనతో తనకు చాలా సన్నిహిత సంబంధం వందని ఈ సందర్భంగా పోలాకి గుర్తు చేసుకున్నారు. తండ్రిబాటలోనే ప్రజలకోసం సేవచేసిన మహా మనిషి అని కొనియాడారు. ఆయన కుటుంబానికి తనతోపాటు విద్యుత్ ఉద్యోగుల తరపున కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని పోలాకి శ్రీనివారసరావు తెలియజేశారు.