స్విమ్స్ మ్రుతులకు రూ.10 లక్షలు నష్టపరిహారం..
Ens Balu
3
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి
2020-10-05 12:49:29
తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లో మృతుని కుటుంబానికి రూ.10లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షలు ఆర్ధిక సహాయం ప్రభుత్వం తరపున అందచేస్తామని ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆళ్ల మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో తక్షణమే మృతి చెందిన కుటుంబాన్ని, గాయపడిన కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారని చెప్పారు. అంతేకాకుండా ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించిమాని, APHMIDC ఎండీ చంద్ర శేఖర్ రెడ్డిని త్వరలోనే నివేదిక ఇస్తారని అన్నారు. అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావ్రుతం కాకుండా చూడాలని స్విమ్స్ డైరెక్టర్ ను ఆదేశించిన ఆళ్ల.. ఈ ప్రమాదంలో ఉద్యోగిని మ్రుతిచెందడం పట్ల తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఆసుపత్రి భవనాలు పరిస్తితి ఎలావుందో అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయించి, తాజానివిదికు ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు.