ద్రోణం లేరనే మాటనే తట్టుకోలేకపోతున్నాం..
Ens Balu
2
Visakhapatnam
2020-10-05 13:02:37
ద్రోణంరాజు శ్రీనివాస్ లేని లోటు వైఎస్సార్సీపీకి ఇక తీరదని రాష్ట్రపర్యాటక శాఖ మంత్రిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ద్రోణంరాజు శ్రీనివాస్ పార్ధీవ శరీరానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విశాఖ అధ్యక్షలు వంశీక్రిష్ణశ్రీనివాస్, ఎమ్మెల్యే అమర్నాద్, అదీప్ రాజ్, నార్త్ ఇన్చార్జి కెకెరాజు ఇతర పార్టీ నాయకులతో కలిసి మౌనం పాటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖలో తన తండ్రి తరువాత నిత్యం ప్రజల్లో వుంటూ సేవలు అందించిన శ్రీనివాస్ లేరనే విషయం చాలా బాధను కలిగిస్తోందన్నారు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడే ఒకే ఒక్క వ్యక్తి ద్రోణంరాజు శ్రీనివాస్ మాత్రమేనన్నారు. అలాంటి వ్యక్తి ఇపుడు మన మధ్య లేకపోవడం చాలా విచారంగా వుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మొల్లి అప్పారావు, పీతల గోవింద్,పల్లా దుర్గారావు, శీలం లక్ష్మణ్ , ట్రేడ్ యూనియన్ బాబా , పైడి శ్రీనివాస్, అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.