ఎన్టీఆర్ భారతరత్న కోసం పోస్టు కార్డు ఉద్యమం..


Ens Balu
1
Visakhapatnam
2020-10-05 13:21:37

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావుకి భారతరత్న ప్రకటించాలని  డా.ఎన్టీఆర్ కళారాధన పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ఎల్ఎన్ స్వామి డిమాండ్ చేశారు.  ఈ సందర్భంగా ఆయన సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ అభిమానుల ఐక్యవేదిక ఏర్పాటు చేసి ప్రభుత్వానికి కోటి ఉత్తరాల ఉద్యమం చేపట్టామన్నారు. ఎన్టీఆర్ అభిమాని ప్రతీఒక్కరూ ఆయనకు భారత రత్నఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.  ఎన్టీఆర్ కళారాధన పీఠం ద్వారా  25 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ, అభిమానులకు ఆయన సినిమాలు, కళారంగం యొక్క విశిష్టతను తెలియజేస్తూ వస్తున్నామని వివరించారు. అంతేకాకుండా విశాఖలో ఎన్టీఆర్ శ్రీక్రిష్ణుడి విగ్రహం కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తెలుగువారు వారు మాత్రమే కాకుండా ప్రపంచంలోని అందరు కళాకారులు అభిమానించే ఏకైకన నటుడు స్వర్గీయ ఎన్టీఆర్ మాత్రమేనన్నారు. అలాంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వం నేటికి భారత రత్న ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఈ విషయాన్ని కేంద్రానికి గుర్తు చేస్తూ పోస్టుకార్డు ఉద్యమంలో అభిమానులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాసరావు, ఆంధ్రప్రదేశ్ సినీగోయర్స్ అధ్యక్షుడు శంకర్రావు, రామక్రిష్ణ, గంగరాజు, శాంభశివరావు తదితరులు పాల్గొన్నారు.