భద్రాద్రి వాసుని ఆర్జీత సేవలు మళ్లీ ప్రారంభం..
Ens Balu
4
Bhadrachalam
2020-10-05 13:34:49
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయని దేవస్థాన అధికారులు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ఇన్నాళ్లు స్వామివారి పూజలకు భక్తులను అధికారులు అనుమతించలేదు. నేటి నుంచి ఆర్జిత సేవలు మళ్లీ ప్రారంభించారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో జరిగే పూజల్లో భక్తులు నేరుగా పాల్గొనేందుకు అనుమతిస్తున్నారు. నేడు ముత్తంగి అలంకారంలో భక్తులకు సీతారాములవారు దర్శనమివ్వనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆర్జిత సేవలు కొనసాగిస్తామని ఆలయ ఈవో శివాజీ వివరించారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా అన్ని రకాల ప్రసాదాలు కూడా అందుబాటులో ఉంచుతున్నామని ఈవో చెప్పారు. ప్రతి ఆదివారం స్వామివారికి చేసే అభిషేకంలో పాల్గొనేందుకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తామన్నారు.`ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఈఓకోరారు.