శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ..


Ens Balu
3
Tirumala
2020-10-05 14:21:31

కేంద్ర బొగ్గు, గ‌నులు, పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి  ప్ర‌హ్లాద్ జోషి సోమ‌వారం ఉదయం విఐపి బ్రేక్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న కేంద్ర మంత్రికి టిటిడి ఈవో(ఎఫ్ఏసి) ‌ ఎవి.ధ‌ర్మారెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా  ప్ర‌హ్లాద్ జోషికి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అంద‌జేశారు.  అనంత‌రం నాద‌నీరాజ‌నం వేదిక‌పై జ‌రిగిన సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. సోమ‌వారం నాటికి సుంద‌ర‌కాండ పారాయ‌ణం 117వ రోజుకు చేరుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి బోర్డు మాజీ స‌భ్యులు భానుప్ర‌కాష్‌రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.