ఏయూ పూర్వవిద్యార్థినికి సిబిల్‌ ‌స్కాలర్‌షిప్‌..


Ens Balu
3
ఆంధ్రాయూనివర్శిటీ
2020-10-05 16:02:39

ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరిగ్‌ ‌కళాశాల(అటానమస్‌) ‌పూర్వ విద్యార్థిని అనిత(బోయపాటి) గొల్లమూడికి ప్రతిష్టాత్మక ది సిబెల్‌ ‌స్కాలర్స్ ‌ఫౌండేషన్‌ అవార్డు లభించింది. ప్రపంచ వ్యాప్తంగా వంద మంది ప్రతిభావంతులను ఎంపిక చేసి ఈ పురస్కారాన్ని సిబెల్‌ ‌స్కాలర్స్ ‌ఫౌండేషన్‌ అం‌దజేస్తుంది. ఈ సందర్భంగా అనితను ఏయూ ఇంజనీరింగ్‌ ‌కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య పేరి శ్రీనివాస రావు అభినందించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అనిత ఏయూలో కంప్యూటస్‌ ‌సైన్స్ ఇం‌జనీరింగ్‌ ‌పూర్తిచేసారన్నారు. స్వశక్తితో ఉన్నతంగా ఎదిగారన్నారు. ప్రస్తుతం హార్వర్డ్ ‌యూనివర్సిటీలో అనిత పిహెచ్‌ని చేస్తున్నారన్నారు. సమాచార గోప్యతపై ఆమె చేస్తున్న పరిశోధన నవ్యతను కలిగి ఉందన్నారు. సిబెల్‌ ‌ఫౌండేషన్‌ ‌మూడు దశల్లో అనిత చేస్తున్న పరిశోధనను పరిశీలించి ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థిని అనిత హార్వర్డ్ ‌విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి చేయడం ఎంతో గర్వకారణమన్నారు. వర్సిటీ విద్యార్థులు అనితను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో పిహెచ్‌డి చేసే దిశగా నడవాలన్నారు. సిబెల్‌ ‌ఫౌండేషన్‌ ‌ప్రతీ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ విశ్వవిద్యాలయాల పరిశోధకులకు ఈ అవార్డులను అందిస్తుంది. అవార్డుతో పాటు రూ 35 వేల డాలర్లు, భారతీయ కరెన్సీలో సుమారు రూ 25 లక్షలు అందిస్తుంది. ఈ నిధులు ఆమె భవిష్యత్‌ ‌పరిశోధనలు ఎంతో  ఉపకరిస్తాయన్నారు. ఇటువంటి ప్రతిష్టాత్మక అవార్డులు సాధించే దిశగా ఏయూ పరిశోధకులు పనిచేయాలన్నారు.