జర్నలిజం విభాగాధిపతిగా ఆచార్య డి.వి.ఆర్ మూర్తి..
Ens Balu
2
ఏయూ జర్నలిజం విభాగం
2020-10-05 16:07:15
ఆంధ్రవిశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతిగా ఆచార్య డి.వి.ఆర్ మూర్తి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం విభాగంలో ఆయన నూతన విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆచార్య డి.వి.ఆర్ మూర్తిని విభాగ ఆచార్యులు చల్లా రామక్రిష్ణ, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు అభినందించారు. ప్రస్తుతం ఆచార్య డి.వి.ఆర్ మూర్తి యూజీ పరీక్షల డీన్గా, విదేశీ భాషల అధ్యయన కేంద్రం సంచాలకునిగా, సేవలు అందిస్తున్నారు. ఆచార్య మూర్తి జర్నలిజం విభాగాధిపతిగా,మీడియా రిలేషన్స్ డీన్గా పనిచేశారు. మళ్లీ ఆయనే జర్నలిజం విభాగ అధిపతిగా రావడం పట్ల విద్యార్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత మంది జర్నలిజంలో పరిశోధనకు మార్గం సుగమం అవుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఆయన ఏయూ విసి ప్రసాదరెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.