ఆధునీకరణ పనులు పూర్తికావాలి..
Ens Balu
3
Ponduru
2020-10-05 18:51:03
శ్రీకాకుళంజిల్లాలో నాడు నేడు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు అన్నారు. పొందూరు మండలం ఖాజీపేట, తోలాపి గ్రామాల్లో నాడు నేడు పనులను సోమ వారం పరిశీలించిన జాయింట్ కలెక్టర్ పొందూరు మండల పరిషత్ కార్యాలయంలో సంబంధిత అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. నాడు నేడు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేసారు. పనుల నాణ్యత పక్కాగా ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టి పాఠశాలల ఆధునీకరణ చేస్తుందని, కార్పొరేట్ స్ధాయి హంగులు కల్పిస్తుందని చెప్పారు. విద్యార్ధులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించి పాఠశాలకు హుషారుగా, ఆసక్తిగా రావాలనే ఉద్దేశ్యంతో అన్ని హంగులు చేపట్టడం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం నాడు నేడులో చేపట్టిన పనుల వలన బడులు అందగా ఉండటమే కాకుండా విద్యుత్ దీపాలు, ప్యాన్ లు, మంచి నల్లబల్లలు, ఇంగ్లీషు లాబ్ లు ఏర్పడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.