యుపీఎస్సీ పరీక్షలపై అవగాహన..


Ens Balu
4
Srikakulam
2020-10-05 20:52:03

శ్రీకాకుళం జిల్లాలోని పదవ తరగతి నుండి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన మైనారిటీ విద్యార్ధినీ విద్యార్ధులకు ఐఎఎస్/ఐపియస్ పై అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ, వక్ఫ్ బోర్డు అదనపు శాఖాధికారి యం.అన్నపూర్ణమ్మ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసారు. జిల్లాలోని మైనారిటీ విద్యార్ధులకు ఐ.ఎ.ఎస్ మరియు ఐ.పి.ఎస్ లపై అవగాహన సదస్సులను ప్రతీ ఆదివారం నిర్వహించడం జరుగుతుందని, ఈ అవగాహన సదస్సులకు హాజరగు ఆసక్తి గల విద్యార్ధులు https://forms.gle/Ex1 hhtrRFYMUKnig8 నకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సదస్సులకు పాల్గొనదలచిన అభ్యర్ధులు తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ తీసుకురావాలని, ఎంపికైన 100 మంది విద్యార్ధులకు ఒక్కొక్క బ్యాచ్ ద్వారా ప్రతీ ఆదివారం వెబినార్ ద్వారా అవగాహన సదస్సులను నిర్వహించడం జరుగుతుందని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశం ఆసక్తి గల విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఇతర వివరాల కొరకు షేక్ నాసిర్, 94900 44933 లేదా రియాజ్, 99890 84099 సెల్ నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆమె ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.