రూ.18.55 లక్షలతో బిటి రోడ్లు..
Ens Balu
3
Gajuwaka
2020-10-06 12:41:06
గాజువాక నియోజకవర్గ పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న రోడ్లు,కాలువలు,కల్వర్టులను పునర్నిర్మిస్తున్నట్టు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తెలిపారు. జీవీఎంసీ 65 వ వార్డు కాకతీయ ఆర్చి నుంచి కొండపైకి 18.55 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొడ్డు నరసింహ పాత్రుడు(కేబుల్ మూర్తి) అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాగిరెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలిపారు.గత ప్రభుత్వంలో అంతా హామీలకే ప్రాధాన్యత తప్ప పనులకు లేదని ఎద్దేవా చేశారు.అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేశామని నిజమైన పారదర్శక పాలనకు ఈ పనులే నిదర్శనమని చెప్పారు.కొండవాలు ప్రాంతాలతో ముడిపడి ఉన్న ఈ వార్డుని అభివృద్ధి లో ముందుకు తీసుకు వెళతామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీధర్,వార్డు నాయకులు మద్దాల అప్పారావు,నాగిశెట్టి శ్రీనివాస్,ఇరోతి గణేష్,జుత్తు లక్ష్మీ, మంగునాయుడు,లోకనాధం,రమణ,మణికంఠ తదితరులు పాల్గొన్నారు.