దాత్రుత్వం చాటుకున్న కెకె.రాజు..
Ens Balu
3
సాయిరామ్ నగర్
2020-10-06 16:16:40
విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త తన దాత్రుత్వాన్ని చాటుకున్నారు. నగరంలోని 50వార్డు సాయిరామ్ నగర్ లో కొండ చరియలు విరిగి మీద పడడంతో 3సంవత్సరాలు బాలిక (గంగోత్రి) మృతి చెందింది. మంగళవారం ఈ విషయం తేలిసిన కె.కె రాజు గారు సంఘటన స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. తక్షణ సహాయం క్రింద కుటుంబానికి రూ.20వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కెకె.రాజు మాట్లాడుతూ, కొండచరియలు విరిగిపడి బాలిక మ్రుతిచెందడం చాలా బాధాకరమని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా తాను ముందుండి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. అంతేకాకుండా కొండ ప్రాంతాల్లో నివాసం ఉండేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలన్నారు. వర్షాలు పడుతున్నందున ప్రమాదాలు జరిగే అవకాశం వుందని ఈ ప్రాంతీయులకు జాగ్రత్తలు చెప్పారు. ఈ కార్యక్రమంలో 50వార్డు అభ్యర్థి వి.ప్రసాద్,అనిల్ కుమార్ రాజు,అల్లు శంకరావు,నీలి రవి, షేక్ జుబైర్,సబృవరపు శ్రీను,మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.