అభివ్రుద్ధి పనులకు శంఖుస్థాపనలు..
Ens Balu
5
Srikakulam
2020-10-06 18:48:36
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడుస్తుందని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం చిన్నలంకాం, మామిడి వలస గ్రామాల్లో పర్యటించిన శాసన సభాపతి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేసారు. చిన్న లంకాం గ్రామంలో సుమారు రూ. 17.50 లక్షల నిధులతో నిర్మించే వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం, మామిడి వలస గ్రామంలో రూ. 21.88 లక్షల నిధులతో నిర్మించే రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేసారు. అనంతరం మామిడివలస గ్రామంలో కొత్తగా నిర్మించిన సిసి రోడ్లును ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం పేదల పక్షపాతి అన్నారు. రైతు భరోసా కేంద్రాలు, వై.యస్.ఆర్ హెల్త్ క్లినిక్ లు తదితర కేంద్రాలను ప్రారంభించి ప్రజలకు చేరువలో సేవలను తీసుకువస్తున్నారని ఆయన పేర్కొన్నారు.