20 నుంచి డిగ్రీ, పీజీ పరీక్షలు..
Ens Balu
3
నన్నయ్య యూనివర్శిటీ
2020-10-06 18:51:21
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ రెండు, నాలుగు సెమిస్టర్లు మరియు పీజీ రెండవ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ ను వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు మంగళవారం విడుదల చేసారు. ఉభయగోదావరి జిల్లాల్లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 20వ తేది నుండి నవంబర్ 3వ తేది వరకు ఉదయం సైన్స్ విద్యార్థులకు, మధ్యాహ్నం ఆర్ట్స్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయని అన్నారు. అలాగే డిగ్రీ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు నంబర్ 4 నుండి 17వ తేది వరకు ఉదయం సైన్స్ విద్యార్థులకు మధ్యాహ్నం ఆర్ట్స్ విద్యార్థులకు జరుగుతాయని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని 114 పరీక్షా కేంద్రాలలో 69159 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాస్తారని తెలిపారు. పీజీ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు ఆర్ట్స్ విద్యార్థులకు ఈ నెల 26 నుండి నవంబర్ 3వ తేది వరకు జరుగుతాయని, సైన్స్ విద్యార్థులకు నవంబర్ 5 నుండి 10 వరకు జరుగుతాయని, ఎంసిఎ ఫోర్త్ సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 11 నుండి 17 వరకు జరుగుతాయని అన్నారు. 24 పరీక్షా కేంద్రాలలో 6170 మంది విద్యార్థులు ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. బిఈడీ, బి.పి.ఈడీ, డిపిఈడీ పరీక్షలు ఈ నెల 20వ తేది నుండి 23వ తేది వరకు 14 పరీక్ష కేంద్రాలలో జరుగుతాయని చెప్పారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీన్ ఎగ్జామ్నెషన్ డా.ఎ.మట్టారెడ్డి, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్నెషన్ ఎస్.లింగారెడ్డి కి సూచించారు.