స్వచ్ఛ సర్వేక్షన్ లో మొదటి స్థానమే లక్ష్యం..
Ens Balu
3
విఎంఆర్డీఏ థియేటర్
2020-10-06 19:03:01
స్వచ్చ సర్వేక్షణ్ లో మెరుగైన ర్యాంకు కొరకు ప్రజా ఆరోగ్య అధికారులు కృషిచేయాలని జీవిఎంసి కమిషనర్ డా.స్రిజన అధికారులను ఆదేశించారు. మంగళవారం వార్డు సచివాలయ శానిటరీ సెక్రటరీలతో వి ఎం ఆర్ డి ఏ చిల్ద్రెన్ థియేటర్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, 2021లో విశాఖపట్నంను స్వచ్చ సర్వేక్షణ్ లో మొదటిస్థానంలో నిలబెట్టడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఒక విప్లవాత్మకమైన మార్పుకోసం వార్డు సెక్రటరేట్ వ్యవస్థను స్థాపించారని, దాని లక్ష్య సాధనకోసం మనం అందరం క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. ప్రతీ వార్డు సచివాలయ ఉద్యోగి వద్ద తప్పని సరిగా వార్డు యొక్క వివరాలు ఉండాలన్నారు. ప్రతి వార్డు సెక్రటరి సచివాలయం లేదా వార్డు పరిధిలో తప్పని సరిగా నివాసముండాలన్నారు. ప్రతీ రోజూ ఉదయం 10.00 గం. ల లోపు కాలువలు రోడ్డు క్లీనింగ్ అవ్వాలని, డస్ట్ బిన్స్ 10.30గం. ల లోపు క్లీన్ అవ్వాలన్నారు. ప్రతీ రోజూ ఎదో ఒక అధికారి సచివాలయాలను సందర్శిస్థారని, మీ యొక్క హాజరు, మూమెంట్ రిజిస్టర్ ను విధిగా చూపాలన్నారు. మీరు సెలవు పెట్టదలచిన యెడల మీ సెలవు చీటీను శానిటరి ఇన్స్పెక్టర్ నకు ఇవ్వాలన్నారు. మీ వార్డు పరిధిలో ప్రతి ఇంటినుండి డోర్ టు డోర్ తడి చెత్త – పొడి చెత్త ను వేరుచేసి తీసుకోవాలన్నారు. ప్రతీ వాణిజ్య దుకాణాలకు ట్రేడ్ లైసెన్సులు వసూలు చేయాలన్నారు. అలాగే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ లతో కలసి మీరు పనిచేయాలన్నారు. రోడ్డుపై చెత్త, బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ వెస్తే వారికి జరిమానా విధించాలన్నారు. ప్రతి వార్డు సెక్రటరీలు అడిగిన తమ సందేహాలను కమిషనర్ నివృత్తి చేసారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున, ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులు ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు. జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు మాట్లాడుతూ విశాఖపట్నంను స్వచ్చ సర్వేక్షణ్ లో ఉన్నత ర్యాంకుకు కావలసిన కార్యచరణ ప్రణాళికను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమీషనరు డా. వి.సన్యాసి రావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఏ.ఎం.ఓ.హెచ్. లు, శానిటరీ సూపెర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు ప్రత్యేక అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.