డిడి చెల్లించిన వారికి ఇళ్లు కేటాయించాలి..


Ens Balu
1
సిపిఎం కార్యాలయం
2020-10-07 13:52:52

‌గ్రేటర్‌ ‌విశాఖనగరంలో పిఎంఏవై పథకం పేర సుమారు 27వేలమంది వద్ద నుంచి రూ.25వేలు డిడిలు 2018లో కట్టించుకూని ఇప్పుడు జివిఎంసి కమీషనర్‌ ‌ డిడిలు కట్టిన ఇళ్ళు అన్నిటిని రద్దు చేశామని చెప్పడాన్ని సీపీఎం పార్టీ ఖండిస్తోందని గంగారామ్ చెప్పారు. విశాఖలో ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారిన తరువాత పాద లబ్దిదారులను ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం బావ్యం కాదన్నారు. డిడిలు చెల్లించిన వారికి వెంటనే ఇల్లు కేటాయించాలని డిమాండ్‌ ‌చేశారు. నగరంలో అర్హులందరికి ఇల్లు ఇస్తామని, పేదలందరికి పక్కాఇల్లు అన్న రాష్టప్రభుత్వం తన రాజకీయ లభ్దికోసం నిర్లక్ష్యంచేస్తోందని ఆరోపించారు.  గాజువాక, మల్కాపురం, పెందుర్తి , అగనంపూడి, మదురవాడ, ఆరిలోవ మొదలగు ప్రాంతాలలో నిర్మణం ప్రారంభించి,  కొన్ని ఇల్లు పూర్తిచేసినవి ఉండగా, 80శాతం పూర్తిఅయినవి ఎక్కవభాగం ఉన్నాయి. అలాంటి ఇళ్లన్నీ పాత లబ్దిదారులకు ఇవ్వాలన్నారు.  ప్రభుత్వం తన అనుచరులకు పంపిణి చేసుకోవడం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం చేయడం పద్దతి కాదన్నారు. ఈ పథకంలో డిడిలు కట్టిన లబ్దిదారులందరు వడ్డిలకు అప్పులు చేసి డిడిలు కట్టారు, రెండున్నర సంవత్సరాల తరువాత ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పడాన్ని తీవ్రంగా నిర్లక్ష్యనికి నిదర్శన మన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచించుకోవాలని,డబ్బులు కట్టిన వారందరికీ తక్షణమే ఇళ్లను కేటాయించాలని లేదంటే పెద్దఎత్తున లబ్దిదారులతో అందోళన చేస్తామని హెచ్చరించారు.