ప్రైవేటుకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు..
Ens Balu
3
శ్రీకాళహస్తి
2020-10-08 18:44:14
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గురువారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాడు పేదరికం కనబడేది, నేడు కార్పొరేట్ స్థాయి బడులు కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ను జగనన్న తీర్చిదిద్దుతున్నారు అని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ప్రభుత్వం అందించిన కానుక పై సంతృప్తి వ్యక్తం చేశారు. జగనన్న సహాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను మరియు అత్యున్నత బోధన అందజేయడం జరుగుతుందని వివరించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకురావడంతో కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ భువనేశ్వరి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పాఠశాల హెచ్ఎం పురుషోత్తం రెడ్డి, స్థానిక వైసిపి నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.