సినిమా షూటింగ్ లకు లైన్ క్లియర్..


Ens Balu
1
Velagapudi
2020-10-08 19:12:55

రాష్ట్రంలో సినిమా ఘాటింగ్ లకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరువులు జారీచేసినట్లు  రాష్ట్ర ఫిల్ము, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి  తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ స్థలాలు, ప్రాంగణాల్లో సినిమా ఘాటింగ్ లు నిర్వహించుకొనే అమమతులను తమ సంస్థ మంజూరు చేస్తుందని,  చిత్ర దర్శకులు, నిర్మాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.  కోవిడ్-19 నేపథ్యంలో రాష్ట్రంలో సినిమా ఘాటింగ్ లను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే అన్నారు.  అయితే భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆగస్టు 21 న జారీచేసిన మార్గదర్శకాలు మరియు స్టాండర్డు ఆపరేటింగ్ ప్రొసీజర్ కు అనుగుణంగా రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం జరిగిందన్నారు.  సినిమాల చిత్రీకరణ సమయంలోఈ మార్గదర్శకాలను మరియు స్టాండర్డు ఆపరేటింగ్ ప్రొసీజర్ను తప్పక పాటించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.  ఈ మార్గదర్శకాల ప్రకారం టెక్నీషియన్లు అందరూ తప్పక మాస్కులు దరించాల్సి ఉందని, అయితే ఘాటింగ్ సమయంలో నటీనటులు మాస్కులు ధరించే విషయంలో కొంత మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. సినిమాల చిత్రీకరణ  సమయంలో సినిమా చిత్రీకరణ పరికరాలు, యూటినిట్లు, సెట్లు అన్నీ కూడా తరచుగా శానిటైజ్ చేయాల్సి ఉంటుందన్నారు.  చేతులు కడుక్కునే సౌకర్యం లేని పక్షంలో అందరు టెక్నీషియన్లు, నటీ నటులు వ్యాండ్ శానిటైజర్లను తప్పక వినియోగించాలని ఆయన తెలిపారు. సినిమాల చిత్రీకరణ సమయంలో సాంకేతికంగా అవకాశం లేని పరిస్థితుల మినహా మిగిలి సమయాల్లో  టెక్నీషియన్లు అందరూ ఆరు అడుగుల  దూరాన్ని పాటించాల్సి ఉంటుందన్నారు.  కరోనా వ్యాప్తి నియంత్రణకై ప్రేక్షకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియపర్చే బహిరంగ సందేశాన్ని చిత్రప్రదర్శన ప్రారంభం మరియు విరామ సమయాల్లో తప్పక ప్రదర్శించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. సినిమాల చిత్రీకరణకు అవసరమైన అనుమతులు, నియమ, నిబందనలు మరియు ఇతర వివరాలను రాష్ట్ర ఫిల్ము, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ www.apsftvtdc.in నుండి పొందవచ్చని ఆయన తెలిపారు.