రెడ్ క్రాస్ ద్వారా మరిన్నిసేవలు..
Ens Balu
0
Vizianagaram
2020-10-09 16:06:45
రెడ్ క్రాస్ సంస్ద ద్వారా జిల్లా ప్రజలందరికీ అవసరమైన సేవలు అందేలా కృషి చేయడం జరుగుతోందని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ తెలిపారు. నెహ్రు యువ కేంద్ర ఆవరణలో రూ.86 లక్షల వ్యయంతో నిర్మించిన రెడ్ క్రాస్ భవనాన్ని శుక్రవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రెడ్ క్రాస్ భవనం నుండి సేవలు అందించేందుకు అవసరమైన ఎక్విప్ మెంట్ ను కూడా వెంటనే ఏర్పాటు చేసుకోవాలని కలక్టర్ కు సూచించారు. అందుకు అవసరమైన ఎక్విప్ మెంట్ వివరాలు, నిధుల సమీకరణ కోసం ప్రతిపాదనలను పంపాలని కలక్టర్ కు తెలిపారు. ఇందుకు అవసరమైన నిధులను సిఎస్ఆర్ కింద సమకూర్చుకొనుటకు గల అవకాశాలను కూడా ప్రతిపాదించాలన్నారు. పూర్తిస్ధాయిలో సేవలు అందించేందుకు సిద్ధం చెయ్యాలన్నారు. అనంతరం భవన ఆవరణలో మంత్రి, పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, స్ధానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి, జిల్లా కలక్టరు డా. ఎం. హరి జవహర్ లాల్, జిల్లా సూపరింటెండెంట్ బి. రాజకుమారితో కలిసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్ద జిల్లా శాఖ చైర్మన్ కె.ఆర్.డి. ప్రసాదరావు, సెక్రటరీ కె. సత్యం, సంయుక్త కలక్టరు (ఆసరా) జె. వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, నెహ్రు యువ కేంద్ర కోఆర్డినేటర్ విక్రమాదిత్య, రెడ్ క్రాస్ సంస్ద సభ్యులు పాల్గొన్నారు.