పీఓడిటిటిగా డా.శంకర్రావు..


Ens Balu
1
డిఎంహెచ్ఓ కార్యాలయం
2020-10-09 16:08:40

విశాఖ వైద్య ఆరోగ్య శాఖ జిల్లా శిక్షణ టీమ్స్ ప్రాజెక్ట్ అధికారిగా (పీఓడీటీటీ) డాక్టర్ ఎం. శంకర్ రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈ పోస్ట్ లో వున్న డాక్టర్ సూర్యనారాయణ ఇటీవల డీఎం హెచ్ఓ గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ ఖాళీ అయిన స్థానంలోకి డాక్టర్ శంకర్ రావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే అయన బాధ్యతలు చేపట్టారు. విజయనగరం జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిగా, నెల్లూరు పీఓడీటీటీ గా, కేజీహెచ్ సీఎస్ ఆర్ఎంఓ గా, అరకు సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గా, జివీఎంసి జోన్ 3 హెల్త్ ఆఫీసర్ గా పనిచేసారు. ఈ సందర్బంగా డాక్టర్ శంకర్ రావు మాటాడుతూ వైద్య సిబ్బందికి వృత్తిపరంగా మంచి నైపుణ్యం పెంచేలా శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తి తో సేవలను అందిస్థానన్నారు.