17న వర్చువల్ లోక్ అదాలత్..
Ens Balu
2
Srikakulam
2020-10-09 18:50:24
శ్రీకాకుళం జిల్లాలో వర్చువల్ లోక్ అదాలత్ ను ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ నోడల్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. వర్చువల్ లోక్ అదాలత్ ను బ్లూ జీన్స్ యాప్ లేదా వాట్సాప్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వర్చువల్ లోక్ అదాలత్ ను 17వ తేదీ ఉదయం 10.30 గంటల నుండి జిల్లా కోర్టు ఆవరణ నుండి నిర్వహించడం జరుగుతుందని, ఈ లోక్ అదాలత్ లో సివిల్ కేసులు, చెక్ బౌన్సు కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, మోటారు ఏక్సిడెంటు కేసులు (వాహన ప్రమాద కేసులు), విడాకులు మినహా ఫ్యామిలి డిస్యూట్స్ (విడాకులు మినహా మిగిలిన కుటుంబ కలహాల కేసులు), లేబర్ అండ్ ఎంప్లాయిమెంటు కేసులు (కార్మిక, యాజమాన్య కేసులు), కాంపౌండబుల్ క్రిమినల్ కేసుల (రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు) పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శుక్ర వారం ఒక ప్రకటన జారీ చేస్తూ సంబంధిత శాఖలు తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాల సమ్మతితో కేసులు పరిష్కారానికి చక్కటి అవకాశమని ఆయన అన్నారు. సంబంధిత కేసులకు సంబంధించిన కక్షిదారులు పరిష్కారానికి వాట్సప్, మెయిల్ ద్వారా సమాచారాన్ని అందించవచ్చని చెప్పారు. జిల్లాలో ఇతర కోర్టులలోనూ వర్చువల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.