గిరిపుత్రుల బతుకుల్లో సీఎం వైఎస్ జగన్ వెలుగు..
Ens Balu
2
Rajavommangi
2020-10-09 19:36:22
రాష్ట్రంలోని గిరిజనులకు భరోసా కల్పించడంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చరిత్ర స్రుష్టించారని అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి అన్నారు. రాజఒమ్మంగిలో మండలంలో సుమారు 1700 మందికి ROFR కొండపోడు భూములకు మంజూరైన పట్టాల్లో శుక్రవారం 460 మంది లబ్ధిదారులకు హక్కుదారుల పాసు పుస్తకాలు(పట్టాలు)ను డిసిసిబి చైర్మన్ అనంత బాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల నుండి పట్టాలు కోసం ఎదురు చూస్తున్న కొండపొడు చేసుకొంటున్న గిరిజనులకు మన ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పెద్ద ఎత్తున కొండపోడు చేసుకొంటున్న గిరిజనులకు పట్టాలు మంజూరు చేశారన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. అలాంటి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు తోడుడుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.