2సార్లు శిక్షణ తీసుకున్నా ఫలితం సున్నా..
Ens Balu
1
వీఎంఆర్డీఏ థియేటర్
2020-10-09 20:27:59
జివిఎంసి వార్డు సచివాలయ వార్డు కార్యదర్శులు నిబద్దతతో పనిచేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన స్పష్టం చేసారు. శుక్రవారం VMRDA ఎరీనా చిల్డ్రన్ థియేటర్ లో వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సచివాలయ వ్యవస్థను ముందుకు తీసుకు వెళ్ళాలని, ప్రతి ఒక్కరూ హజరు పట్టిక, మూమెంట్ రిజిస్టర్, డైరీ రాయాలన్నారు. మీపై చాలా బాధ్యతలు ఉన్నాయని క్రమశిక్షణతో పని చేయాలని, విధులలో అలసత్వం పనికిరాదని హితవు పలికారు. ప్రతి వార్డులో మొత్తం 1200 వరకు ఇళ్ళు ఉంటాయని, అందులో ఎన్ని నివాస గ్రహాలు, సెమీ నివాస గృహాలు, వాణిజ్య గృహాలు ఉన్నాయో తెలుసుకొని వాటిపై మీకు పూర్తీ అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి రోజు వార్డును తనిఖీ చేసి ఎవ్వరైన కొత్తగా ఇళ్ళు నిర్మిస్తున్నారా? వాటికి ప్లాన్ ఉన్నాదా? అని తెలుసుకోవాలన్నారు. ప్లానింగ్ సంబందించిన డాటాపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. అక్రమ నిర్మాణములను గుర్తించి వాటిని నిలువరించాలన్నారు. జివిఎంసి పరిధిలో చాలా వరకు అన్ని జోన్లలో BPS, LRS అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయని వాటిని 3రోజులలో క్లియర్ చేయాలని కార్యదర్శులను హెచ్చరించారు. ఈ రోజు సాయంత్రంలోగా కనీసం ఒకటి లేక రెండు LRSను అప్లోడ్ చేయాలని లేని యెడల క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ 15 రోజులకు ఒక సారి ప్లానింగ్ కార్యదర్శులు రివ్యూ మీటింగు పెట్టమని సి.సి.పి. ని ఆదేశించారు. ఇప్పటి నుండే కష్టపడి పనిచేస్తే పైకి ఎదగడానికి మంచి అవకాసం ఉంటుందన్నారు. అనంతరం చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత మాట్లాడుతూ, మీకు రెండు సార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగినదని, ఇంకా మీకు పూర్తిగా అవగాహన రాలేదని, ఇకపై అలా జరిగితే మీపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరు, ఫీల్డుకు వెళ్లి వివరాలు నమోదు చేయాలన్నారు. అనంతరం, వివిధ అంశంలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లతతో పాటూ, ఏ.సి.పి.లు, టి.పి.ఎస్.లు, టి.పి.ఓ.లు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.