కేన్సర్ ఆసుపత్రికి రెండు ఏసీలు విరాళం..


Ens Balu
2
కేన్సర్ ఆసుపత్రి
2020-10-09 20:56:22

సేవా ద్రుక్పదంలో ఆసుపత్రి సౌకర్యార్ధం ఏసిలు బహుకరించడం అభినందనీయమని డా.ఏ.సిరి అన్నారు. శుక్రవారం  అనంతపురంలోని ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రికి   మరో రెండు (2 టన్స్) ఎయిర్ కండీషనర్లు విరాళంగా కే పి ఆర్ కన్స్ట్రక్షన్స్, హేమ ఇండస్ట్రీస్  సహకారంతో   రెండు ఎయిర్ కండీషనర్లు విరాళంగా అందజేశారు. నగరంలోని శారదా నగర్ లో ఉన్న ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రిలో జాయింట్ కలెక్టర్ (విలేజ్ మరియు వార్డు సచివాలయం డిపార్ట్మెంట్)  ఏ సిరి  ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కమీషనర్  పి వి వి ఎస్ మూర్తి విజ్ఞేప్తి మేరకు వీటిని అందజేశారు. మొత్తం నాలుగు ఏసిలను వీరు అందజేశారు.   వాటితో పాటు అదే ఆసుపత్రి లో కరోన నుంచి కొలుకున్న రామ్మోహన్ రెడ్డి ఫర్నిచర్ ని విరాళంగా ఇచ్చారు. సేవా దృక్పధం తో ముందుకు వచ్చి ఇల తమ వంతు సాయంగా ఆసుపత్రికి కి కావాల్సిన పరికరములు సమకూరుస్తున్నందుకు చాల సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో నగరపాలక ఆరోగ్య అధికారి డాక్టర్ రాజేష్ , కాన్సర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు దాతలు పాల్గొన్నారు..