శ్రీ ఖాద్రీ నృసింహుశుని దర్శనానికి పోటెత్తిన భక్తులు..


Ens Balu
2
Kadiri
2020-10-10 16:51:13

అనంతపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఖాద్రీ నృసింహుశుని శనివారం భక్తులు పోటెత్తారు. నవ నరసింహుని క్షేత్రములలో కెల్ల భక్త ప్రహ్ల్లాద సమేతముగా స్వయంభూగా వెలశియున్న క్షేత్రమే కాకుండా చారిత్రాత్మకంగా వాసికెక్కిన ప్రశిద్దిమైన వైష్ణవ క్షేత్రమిది. దానికితోడు అధిక ఆశ్వయుజ మాసం బాహుళ  పక్షం అష్ఠమి  పునర్వసు  నక్షత్రం రెండవ శనివారము, శెలవు దినము సందర్భంగా  శ్రీ ఖాద్రీ నృసింహుని దర్శనమునకు విచ్చేసిన భక్తుల రద్ది అధికమైంది. లాక్ డౌన్ తొలగించినప్పటి నుంచి క్రమంగా ఆలయమునకు భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. భక్తుల సంఖ్య అనుగుణాంగా నేటి నుండి ప్రత్యేక దర్శనము, శీఘ్రదర్శనము క్యూలైన్ల్ ద్వారా కూడ భక్తులకు స్వామి వారి దర్శనమునకు కల్పించినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తాదులు ముఖ్యంగా స్వామి వారి ఇంటి ఇలవెల్పుగా వుండే భక్తులు,  కర్నాటక రాష్ట్రములోని వివిధ ప్రాంతముల  నుంచి  అధికముగా వస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ రోజు తలనీలాలు కూడా సమర్పించడం విశేషం.