నెల్లూరులో సచివాలయ ఉద్యోగుల అడ్ హాక్ కమిటీ..


Ens Balu
4
Nellore
2020-10-10 19:00:29

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గ్రామసచివాలయ ఉద్యోగుల సమస్యలను యూనియన్ ద్వారా పరిష్కరించుకోవడానికి అందరు ఉద్యోగులు సహకరించాలని నెల్లూరు జిల్లా గ్రామసచివాలయ ఉద్యోగుల సంఘం అడ్ హాక్ కమిటీ చైర్మన్ sk.బషీర్ అహ్మద్ అన్నారు. APGEA రాష్ట్ర నాయకులు  చొప్పా రవీంద్రబాబు పర్యవేక్షణలో జిల్లా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సంఘం అడ్ హాక్ కమిటీని శనివారం ఏర్పాటు అయ్యింది. శ్రీ జెట్టి శేషారెడ్డి విజ్ఞానకేంద్రం లో ఈ కమిటీని ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఈ కమిటీకు చైర్మన్ గా Sk.బషీర్ అహ్మద్ , కన్వీనర్ గా S.బాబూరావు, శాధికారిగా I. మణికోను ఎన్నుకున్నారు. వీరితో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన  మరో 18 మంది గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు కో చైర్మన్ లు గాను, కో కన్వీనర్ లు గాను ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యూనియన్ కి సంబంధించిన ఏ అంశమైనా కమిటీ ద్వారా చర్చించుకునేలా సమావేశంలో తీర్మాణించారు. కమిటీలన్నీ రాష్ట్రనాయకత్వం ఆధ్వర్యంలో పనిచేస్తాయని చొప్పారవీంద్రబాబు కమిటీకి తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ సచివాలయాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.