మరపురాని నాయకుడు వైఎస్సార్ మాత్రమే..
Ens Balu
4
Ghantasala
2020-10-10 19:35:51
క్రిష్ణాజిల్లా ఘంటసాల మండలం, పూషడం హరిజనవాడలో ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని దాత డాక్టర్ దాస్, మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేసిన వైఎస్సార్ వారి గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారన్నారు. తండ్రికి మించిన తనయుడిగా సీఎం జగన్ మరో రెండుఅడుగులు ముందుకేసి మహిళలు ఆర్థికాభివృద్దే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. జగన్ పాలనలో 50శాతం మహిళలకు కేటాయించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించిన ఘనత దేశానికే ఆదర్శమన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో టీడీపీ నేతలను ప్రశ్నించాలని ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన ప్రతిఒక్కరికి మంత్రి, ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం గ్రామంలో 4 సిసి రోడ్లు, చెరువుకు రివిట్ మెంట్ కు ఏర్పాటుకు హామీ ఇవ్వడంతో పాటు మాజేరు మల్లాయి చిట్టూరు వయా పూషడం రోడ్లు నిర్మాణం కు నిధులు మంజూరు చేసారని త్వరలో పనులకు ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు వేమూరి వెంకట్రావు, నేతలు మాడెం నాగరాజు, చికినం బాలాజీ, గిరీష్, ఈఓ బి.అర్జునరావు, డిటి మల్లేశ్వరరావు, కోటేశ్వరరావు, పార్టీ నేతలు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.