నిరుపేదకు వానపల్లి చేయూత..
Ens Balu
1
డాబాగార్డెన్స్
2020-10-10 20:17:13
ఆర్దికంగా బాగా చితికిపోయిన కప్పరాడకు చెందిన భర్త చనిపోయి ఇబ్బందుల్లో ఉన్న శ్రీదేవి అనే మహిళకు మాజీ కార్పొరేటర్ సాయిపూజ ఫౌండేషన్ వ్యవస్థాపకులు టిడిపినేత వానపల్లి రవికుమార్ శనివారం రైస్ బ్యాగ్ అందజేశారు. శ్రీదేవి రైల్వే కాలనీ, జి. హెచ్ స్కూల్ పూర్వ విద్యార్థి. తనకు, తన కుమారుడికి ఆరోగ్యం బాగాలేదని శ్రీదేవి తెలియజేసిన మేరకు రవికుమార్ మానవతాదృక్పదంతో స్పందించి ఈ సహాయం చేశారు. అంతేకాకుండా ప్రతీ నెలా ఈమెకు నిత్యావసర సరుకులు ఇస్తామని భరోసాఇచ్చారు. ఈ సేవకార్యక్రమం చేయడటం పట్ల జి. హెచ్. స్కూల్ పూర్వ విద్యార్థులు రవికుమార్ కు ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివోహం మురళి, వార్డు కార్యదర్శి సారిపల్లి మహేష్,కృష్ణ,శ్రీను,రైల్వే న్యూ కాలనీ లో ఉన్న ప్రభుత్వ పాఠా శాల పూర్వ విద్యార్థులు బూర్లె రమేష్, డి. హరనాథ్, డి. ఉదయ్ కుమార్, ఆది తదితరులు పాల్గొన్నారు.