రాజకీయ దరుంధరుడు గుడివాడ..గంట్ల
Ens Balu
3
Dwaraka Nagar
2020-10-11 11:17:28
ఉత్తరాంధ్రా ముద్దుబిడ్డ, రాజకీయ దురంధరుడు దివంగత గుడివాడ గురునాధరావని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్లశ్రీనుబాబు కొనియాడారు. ఆదివారం గుడివాడ గరునాధరావు జయంతి సందర్భంగా అనాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్, ఇంటక్ నేత మంత్రి రాజశేఖర్ తో కలిసి గుడివాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంట్ల మీడియాతో మాట్లాడుతూ, తనకు పరిచియమైన ప్రతీ వ్యక్తిని పేరుపెట్టి మరీ పిలిచి ఆప్యాయతను చూపే ఒకేఒక్క నాయకుడు గుడివాడ గురునాధరావని కొనియాడారు. ఎంపీగా ఎన్నో సంస్కరణలు చేసి, ఉత్తరాంధ్రాకి మేలు చేసిన మహాను భావుడని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లోనే నేడు అనకాపల్లి ఎమ్మెల్యేగా గుడివాడ అమర్నాద్ కూడా ప్రజల మనిషిగా సేవలు చేయడం అభినందనీయమని అన్నారు. గుడివాడ కుటుంబం మొత్తం ప్రజాసేవకే అంకితమైన కుటుంబంగా చరిత్రకెక్కారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అమర్నాధ్ శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారని అన్నారు గంట్ల. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.