ఆదివారం లాక్ డౌన్ ఎత్తివేత..
Ens Balu
1
కలెక్టరేట్
2020-10-11 18:30:46
శ్రీకాకుళం పట్టణంలో విధించిన లాక్ డౌన్ నిబంధనలకు సడలింపు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఇప్పటి వరకు వ్యాపార కార్యకలాపాలు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నామని, సోమ వారం నుండి దానిని రాత్రి 9 గంటల వరకు నిర్వహించుకొనుటకు సడలింపులు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు ఆది వారం ఒక ప్రకటన విడుదల చేసారు. అదేవిధంగా శ్రీకాకుళం పట్టణంలో అమలు చేస్తున్న ఆది వారం సంపూర్ణ లాక్ డౌన్ సైతం ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోను, పట్టణంలోను కోవిడ్ కేసులు అత్యధికంగా ఉన్న సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ విధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టాయని ఆయన చెప్పారు. అయితే ప్రజలు అన్ని సురక్షిత చర్యలు తీసుకుని బయటకు రావాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్ కు ప్రజలు మంచి సహాయ సహకారాలు అందించారని తద్వారా కేసులలో తగ్గుముఖం వచ్చిందని అన్నారు. జిల్లా నుండి సమూలంగా వైరస్ నిర్మూలన జరగాలనే సంకల్పంతో ఉన్నామని అందుకు ప్రజలు సహకరించి అవసరం అనుకుంటేనే బయటకు రావాలని హితవు పలికారు. బయటకు వచ్చే వారు మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను సబ్బుతోగాని, శానిటైజర్ తో గాని తరచూ శుభ్రపరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దుకాణదారులు కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని ఆయన ఆదేశించారు. ఎక్కడా ఎక్కువ మంది గుమిగూడ వద్దని, ఆది వారం రోజున మాంసాహార దుకాణాల వద్ద రద్దీ లేకుండా ఎవరికి వారు స్వీయనియంత్రణ పాటించాలని కోరారు. కరోనా వైరస్ నివారణ ప్రతి ఒక్కరి నినాదం కావాలని, బాధ్యతతో మెలిగి ఆరోగ్యాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.