ప్రెస్ అకాడమీ చైర్మన్ తో రేపు మీట్ ది ప్రెస్..


Ens Balu
3
విజెఎఫ్ ప్రెస్ క్లబ్
2020-10-11 19:23:41

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ తో విజెఎఫ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం సోమవారం ఉదయం 11గంటలకు నిర్వహిస్తున్నట్టు విజెఎఫ్ అధ్యక్ష, కార్యదర్శిలు గంట్లశ్రీనుబాబు, ఎస్.దుర్గారావులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ప్రెస్ అకాడమీ రాష్ట్ర పర్యటనలో భాగంగా విశాఖ వస్తున్నారన్నారు. జర్నలిస్టుల సౌకర్యార్ధం మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని డాబాగార్డెన్స్ విజెఎఫ్ లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం జర్నలిస్టుల కోసం చేపట్టే కార్యక్రమాలు, పరిష్కారం కాని సమస్యల విషయాలను నేరుగా అకాడమీ చైర్మన్ ద్రుష్టికి తీసుకురావడానికి అవకాశం వుంటుందనే కారణంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. విశాఖలోని అన్ని మీడియా సంస్థల జర్నలిస్టులు ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి హాజరు కావాల్సింది విజెఎఫ్ కమిటీ కోరింది. దానికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్టు వివరించారు.