ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలి..
Ens Balu
3
కలెక్టరేట్
2020-10-12 14:13:24
స్పందన దరఖాస్తులపై అన్నిశాఖ అధికారులు సత్వరమే స్పందించి ప్రజల అర్జీలకు న్యాయం చేయాలని డీఆర్వఓ బలివాడ దయానిధి అధికారులను ఆదేశిం చారు. సోమవారం శ్రీకాకుళం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 112 వినతులు వచ్చాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖకు చెందినవి 25 కాగా, పౌర సరఫరాల శాఖవి 16, ఇతర శాఖలకు సంబంధించి 71 వినతులు ఉన్నాయని తెలిపారు. కరోనా నేపధ్యంలో ప్రజలు జిల్లా ప్రధాన కేంద్రానికి రాకుండా ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా వినతులు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చిన సంగతి విదితమే. అందులో భాగంగా సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఫోన్ చేసి 112 మంది తమ ఫిర్యాదులను తెలియజేసారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ ఎన్. అప్పారావు, స్పందన విభాగం సూపర్ వైజర్ బి.వి.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.