డయల్ యువర్ కమిషనర్ కి 23 ఫిర్యాదులు


Ens Balu
3
జివిఎంసి కార్యాలయం
2020-10-12 18:35:37

 జి.వి.ఎం.సి.  ప్రధాన  కార్యాలయం  సమావేశపు  మందిరం నుంచి డయల్ యువర్ కమిషనర్ ప్రోగ్రామును ఉప కమిషనర్ (రెవెన్యూ) ఫణిరాం టోల్ ఫ్రీ నం.1800-4250-0009 ద్వారా ఉదయం 10.00 గం. నుండి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ప్రజలనుండి విజ్ఞప్తులు స్వీకరించారు. స్వీకరించిన విజ్ఞప్తులను స్వయంగా పరిష్కరించి తగు నివేదిక వెంటనే సమర్పించు నిమిత్తం ఆయా విభాగాల అధికారులను/జోనల్ కమిషనర్లకు పంపించారు. ఇందులో ఒకటవ జోనుకు సంబందించి 05, రెండవ జోనుకు సంబందించి 04, మూడవ జోనుకు సంబందించి 05, నాల్గవ జోనుకు సంబందించి 05, అయిదవ జోనుకు సంబందించి 01, ఆరవ జోనుకు సంబందించి 02, ఎడవ  జోను(అనకాపల్లి)కు సంబందించి 01,  మొత్తము 23 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమీషనర్ డా. జి. సృజన ప్రధాన కార్యాలయ విభాగపు ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమీషనరు వి. సన్యాసి రావు, జాయింట్ డైరెక్టర్ (అమృత్) విజయ భారతి, అసిస్టెంట్ డైరెక్టర్(ఉద్యాన శాఖ) ఎం. దామోదర రావు తదితరులు పాల్గొన్నారు.