ఆసెట్‌కు 80.85 శాతం హాజరు..


Ens Balu
4
Visakhapatnam
2020-10-13 19:10:31

ఆం‌ధ్రవిశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్‌ ‌ప్రవేశ పరీక్షకు తొలిరోజు 80.85 శాతం హాజరు నమోదయ్యింది. ఉదయం పరీక్ష కేంద్రాలను ఏయూ రెక్టార్‌ ఆచార్య కె.సమత పరిశీలించారు. పరీక్షల నిర్వహణ తనిఖీ చేశారు. మంగళవారం లైఫ్‌ ‌సైన్సెస్‌, ‌స్టాటస్టిక్స్, ‌బిఎఫ్‌ఏ, ‌జియాలజీ, ఇంగ్లీషు, ఎకనామిక్స్ ‌కోర్సులకు పరీక్షలు జరిగాయి. మెత్తం 5196 మంది దరఖాస్తు చేసుకోగా 4201 మంది పరీక్షకు హాజరయ్యారు. దీనితో తొలిరోజు పరీక్షకు 80.85 శాతం హాజరు నమోదయ్యింది. పరీక్షలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ,రాజమండ్రి, ఏలూరు, విజయవాడ గుంటూరు నగరాల్లో నిర్వహించినట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఏ నాయుడు తెలిపారు. బుధవారం  కెమికల్‌ ‌సైన్స్, ‌తెలుగు, ఫిజికల్‌ ‌సైన్స్, ఎం‌కాం కోర్సులకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షల నిర్వహణను అసోసియేట్‌ ‌డైరెక్టర్లు ఆచార్య ఎస్‌.‌బి పడాల్‌, ‌డాక్టర్‌ ‌సి.వి నాయుడులు పర్యవేక్షించారు.