ఎన్టీఆర్ మార్గ్ సత్వరం పూర్తికావాలి..


Ens Balu
2
Anantapur
2020-10-13 19:30:05

అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న క్రాంతి హాస్పిటల్ నుంచి తాడిపత్రి రోడ్డు వరకు నిర్మిస్తున్న ఎన్టీఆర్ మార్గ్ రహదారి పనులను వేగవంతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మంగళవారం గుత్తి రోడ్ లోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఎన్టీఆర్ మార్గ్ రహదారి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో ని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నున్న క్రాంతి హాస్పిటల్ నుంచి గుత్తి రోడ్డు, భారత్ పెట్రోల్ బంక్, భవాని రోడ్డు మీదుగా తాడిపత్రి రోడ్డు వరకు ఎన్టీఆర్ మార్గ్ రహదారి పనులను చేపడుతున్నామని, పనులను వేగవంతం చేయాలన్నారు. రహదారి నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణ పనులను పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మార్గ్ రహదారి నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు ఎంత మేరకు పనులు చేపట్టారు అనే వివరాలను కలెక్టర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పివివి ఎస్ మూర్తి, డి ఈ సుధారాణి, ఏ ఈ నాగజ్యోతి, తహశీల్దార్ లక్ష్మీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.