వర్షాలు తగ్గగానే పంట నష్టం అంచనా..


Ens Balu
4
కలెక్టరేట్
2020-10-13 19:32:00

వర్షాలు తగ్గిన తర్వాత పంట నష్టాల ఎన్యూమరేషన్ ప్రారంభమవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. మంగళవారం సర్క్యూట్ హౌస్ లో జిల్లా ప్రజా ప్రతినిధుల సమస్వయ సమావేశం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆగష్టు , సెప్టెంబరు నెలలో వర్షాలు ఎక్కువగా ఉన్నాయని, ఏలూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలో పంట నష్టాలు జరిగాయి, వర్షాలు తగ్గిన వెంటనే పంట నష్టాలకు సంబంధించి ఎన్యూమరేషన్ ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. వేరు శనగ రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. అంతకు ముందు సర్క్యూట్ హౌస్ లో వివిధ సమస్యలుపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్య సభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి, పార్లమెంట్ సభ్యులు ఎం.వి.వి. సత్యనారాయణ బి.వి. సత్యవతి, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, డి.వి.జి. కాళిదాసు రంగారావు, నగర పోలీసు కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా, జిల్లా ఎస్.పి. బి. కృష్ణారావు, శాసన సభ్యులు గుడివాడ అమర్ నాథ్, కన్నబాబురాజు, వాసుపల్లి గణేష్ కుమార్, అదీప్ రాజ్, కరణం ధర్మశీ, గొల్ల బాబూరావు, భాగ్యలక్ష్మి, ఫాల్గుణ, మాజీ శాసన సభ్యులు మళ్ల విజయ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు