కరోనా నుంచి రక్షణకు మూడంచెల విధానం..


Ens Balu
3
ఆంధ్రామెడికల్ కాలేజి
2020-10-13 19:50:49

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ప్రవేశపెట్టిన ఆన్లాక్  ప్రక్రియ  కరోనాను అరికట్టేందుకు దోహదపడుతోందని ఉత్తరాంధర జిల్లాల  కోవిడ్ నోడల్ అధికారి , ఎఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వి. సుధాకర్  అన్నారు."జన్  ఆందోళ న్  కరోనా అప్ప్రొప్రైట బిహేవియర్ " పై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన రీఙనల్ ఔట్ రీచ్ బ్యూరో, ఆకాశవాణి వార్త విభాగం సంయుక్తంగా  ఏర్పాటు చేసిన  జాతీయ వెబ్‌నార్‌లో సుధాకర్ మాట్లాడారు.  "జన ఆందోళలన్ కరోనా అప్రోప్రేట్ బిహేవియర్, పేరిట మోడి ప్రభుత్వం సూచించిన   మూడు రక్షణ కవచాల సూత్రాలు అందరూ  పాటించాలని చెప్పారు.   మానసిక ఆరోగ్య సంరక్షణను ఆ సూత్రాలు పెంచుతాయని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాలు  సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుందని అన్నారు. సంస్థ అడిషనల్  డైరెక్టర్ జనరల్  డి. మురళి మోహన్  మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాలు చేపట్టిన అవగాహన కార్యక్రమం ఏంతో ప్రాధాన్యతను సంతరించుకుందని అన్నారు.  కరోనా కారణంగా 6 నెలల గా ఎదుర్కున్న అనుభవాలను పొందుపరుచుకోవాలని తెలిపారు.  "మాస్క్ ధరించడం అంటే  గౌరవ సూచిక అని, తమని  రక్షిస్తుందని,  6 అడుగుల సామాజిక దూరం, సబ్బుతో 20 సెకన్లు చేతులు కడుక్కోవడం, శుభ్రత పాటించడం కరోనా ను ఎదుర్కొవడానికి ఒక  బృహత్తర ప్రణాళిక అని అభివర్ణించారు. విశాఖపట్నం ప్రభుత్వ మానసిక సంరక్షణ  ఆసుపత్రి సూపెరెండెంట్   సైకియాట్రిస్ట్, డాక్టర్ రాధ రాణి,  మాట్లాడుతూ,   ప్రభుత్వం నిర్దేశించిన మూడు రక్షణ సూత్రాలు,  మానసిక  స్థితిని  మెరుగుపరుచు కోవడానికి ముఖ్యమని చెప్పారు. కుటుంబం, స్నేహితులు, బంధువుల మద్దతు, కరోనా నేపధ్యం లో పలు  సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతాయని అన్నారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి వ్యాయామం, నిద్ర, యోగా, ధ్యానం మరియు అభిరుచుల  ముఖ్యమని  ఆమె అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో  రీజినల్ అవుట్  రీచ్  బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. శ్రీనివాస్ మహేష్, బి. తారకా ప్రసాద్, ఎఫ్. పి. ఓ, నెల్లూరు, ఐ& బి అధికారులు వెబ్‌నార్‌లో పాల్గొన్నారు.