తుని రైల్వే వంతెన పైనుంచే వరద...


Ens Balu
1
తుని
2020-10-14 13:27:26

తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలకు రోడ్లేకాకుండా రైల్వే వంతెనలు, రల్వేస్టేషన్లు జలయమం అయ్యాయి. బుదవారం తుని రైల్వే వంతెన పై నుంచి వరదనీరు పొంగి పొర్లింది. దీంతో ఈ ప్రాంతంలోకి ఎవరినీ వెళ్లకుండా కట్టడి చేశారు. శంఖవరం మండలంలో పెద్దగెడ్డలో ఒక ద్విచక్రవాహనం కొట్టుకుపోయింది. ఆ సమయంలో రైతులు గమనించి బండిపై కొట్టుకుపోతున్నవారికి కాపాడారు. వాహనం అక్కడి బురదలో ఇరుక్కుపోయింది. రెండు రోజుల పాటు, నాలుగు కాలనీలు జలమయం అయి వున్నాయి. ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు. ఇక కాకినాడ, సామర్లకోట, అన్నవరం రైల్వే స్టేషన్లు అన్నీ జలమయం అయ్యాయి. వంతెలన మీద నుంచి వరదనీరు పారడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. ముఖ్యంగా విద్యుత్ లైన్ల ప్రాంతాల్లో ఎవరినీ వెళ్లనీయకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.