త్వరలోనే సాధారణ వైద్యసేవలు..


Ens Balu
5
కలెక్టరేట్
2020-10-14 19:25:49

అనంతపురం జిల్లాలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి , ఆర్డీటీ ఆస్పత్రులలో  నాన్ కోవిడ్ కేసులకు వైద్య సేవలందించేందుకు దశలవారీగా చర్యలు తీసుకుంటున్నామని  జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలియజేశారు. బుధవారం కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇంతకుముందు కోవిడ్ 19 నేపథ్యంలో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రులను పూర్తి స్థాయిలో కోవిడ్ ఆస్పత్రులుగా మార్చడం జరిగిందన్నారు.  ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గిన నేపథ్యంలో  ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ఆర్డీటీ ఆస్పత్రులలో నాన్ కోవిడ్ కేసులకు  వైద్య సేవలందించేందుకు దశల వారీగా   చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల పరిధిలో కేసుల వివరాలు స్టడీ చేసి, పరిస్థితులను బట్టి సాధారణ వైద్యసేవలు అందుబాటులోకి తెస్తామన్నారు.