ఎల్సీడీ సర్వే 14రోజుల్లో పూర్తి..


Ens Balu
4
Tirupati
2020-10-14 19:30:58

జాతీయ కుష్టు నివారణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 1 నుండి 14 వరకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ఇంటింటి సర్వే చేపట్టామని జిల్లాలో 1400 మంది అనుమానితులను గుర్తించించడం జరిగిందని సహాయ డి  ఎం అండ్ హెచ్ ఓ డా.అరుణ సులోచనాదేవి తెలిపారు. జాతీయ కుష్టు   వ్యాధి నిర్మూలన కార్యక్రమం  ముగింపు సమావేశం బుధవారం స్థానిక  పూర్ హోమ్ వద్ద గల  లేప్రసీ కాలనీ లో ఘనంగా నిర్వహించి ఐ ఎం ఏ ప్రతినిధుల సాయం తో లెప్రసీ కాలనీ వాసులకు మెడికల్ కిట్లు,  సానిటైజర్లు  పంపిణీ చేశారు.  డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో జరిగిన కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఇంటింటి సర్వే పూర్తి అయిందని, ఉన్నతాధికారులు   ప్రసంశించారని తెలిపారు. ఇప్పుడు గుర్తించిన 1400  మంది అనుమానితులు మాత్రమేనని , మరో 15 రోజుల్లో వీరికి పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తామని, ఇందులో చర్మ వ్యాధులు  కూడా ఉండవచ్చని తెలిపారు. పూర్తి పరీక్షల నిర్వాహణతో కుష్టు నిర్థారణ అవుతుందని ఇందులో అలాంటి కేసులు బయట పడితే  త్వరగా చికిత్స అందించి అంగవైకల్యం నివారణ చేయవచ్చని తెలిపారు. ఇందులో బాగస్వాములు అయిన వైద్య సిబ్బంది, ఎం పి డి ఓ లకు ధన్యవాదాలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఐ ఎం ఏ ప్రతినిధులు కృష్ణ ప్రశాంతి , డా.అర్చన శర్మ, డా.రవిబాబు, డా. శ్రీహరి, డా. యుగంధర్  తదితరులు పాల్గొన్నారు.