రుణాల ప్రక్రియ సత్వరం పూర్తికావాలి..


Ens Balu
4
కలెక్టరేట్
2020-10-14 19:32:30

పేదల ఆర్థిక పరిస్తితి మెరుగు కోసం జగనన్నతోడు రూ.10వేలు రుణ మంజూరు పథకాన్ని ముఖ్యమంత్రి ఈ నెల 28 న ప్రారంభించనున్నారని జిల్లాలో ఇప్పటి వరకు 32 వేల  ధరఖాస్తులు అందాయని బ్యాంకర్లు టార్గెట్ తో పనిలేకుండా మంజూరు చేయాలని ఎస్.ఎల్.బి.సి.కూడా నిర్ణయించిందని ఆలస్యంలేకుండా అర్హతగల వారికి మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్  డా.ఎన్.భరత్ గుప్త బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బ్యాంకర్లతో జెసి (డి) వీరబ్రహం , ఇంచార్జ్ జెసి (ఆసరా) రాజశేఖర్ లతో కలసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే బ్యాంకర్లకు జగనన్నతోడు ధరఖాస్తులు అందినా మంజూరులో ఆలస్య చేయడం సమాజసం కాదని , కరోనా పరిస్థితులు, మానవతా దృక్పధం ఆలోచించి మంజూరు  చేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసున్న పథకమని,  ఈ రుణం కేవలం బిపిఎల్ కుటుంబాలకనే విషయం గుర్తించాలని  అన్నారు. జిల్లాలో  ఈ నెల 20 నాటికి 35 వేల మంది వరకు అర్హత వచ్చే అవకాశంవుందని, ఋణ మంజూరు విషయంలో  బ్యాంకులకు టార్గెట్ తో పని లేదని ఎన్ని వచ్చినా మంజూరు చేయవచ్చవని సూచించారు. బ్యాంకింగ్ రంగం దేశ ఆర్థిక వ్యవస్థ మార్చగలిగే శక్తి వుందని గ్రహించాలని అన్నారు. వీధి వ్యాపారస్తుల కోసం పి.ఎం. స్వానిధి గరిష్టంగా రూ. 10000/-వరకు రుణం మంజూరుపై దృష్టి సారించాలని అన్నారు. బ్యాంక్  సిబ్బంది తక్కువ వున్న చోట సచివాల డిజిటల్ అసిస్టెంట్స్ ను డాటా ఎంట్రీకి ఉపయోగించుకుని ఈ నెల 20 నాటికి మంజూరు పూర్తి చేయాలని అన్నారు.  ఈ సమీక్షలో  పిడీలు మెప్మా జ్యోతి, డిఆర్ డి ఎ తులసి ,ఎల్.డి.ఎం. గణపతి, ఇండియన్ బ్యాంక్ ఎజిఎమ్ శ్రీనివాస్ , ఎస్.బి.ఐ., ఐ ఓ బి , ఆంధ్రా బ్యాంక్ , కెనరా బ్యాంక్ , సప్తగిరి గ్రామీణ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.