అధికారులూ అప్రమత్తంగా ఉండాలి..


Ens Balu
2
కలెక్టరేట్
2020-10-14 20:39:17

అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, భారీ వర్షాలు వలన వచ్చే వరదలకు సంబంధించి దెబ్బతిన్న పంటలు, చెరువులకు గండ్లు, విద్యుత్ సరఫరా ,రోడ్డు మరమ్మతులు తదితర పనులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. వీటికి సంబంధించిన నష్టాల ను అంచనా వేసి నివేదికలను వేగవంతంగా పంపాలన్నారు. ఇళ్ల డ్యామేజీ, ప్రాణ నష్టాల వివరాలను  తెలియజేయడం తో పాటు బాధితులకు తక్షణమే పరిహారం అందజేయాలన్నారు.  సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని డయేరియా లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున శానిటేషన్ మీద ప్రత్యేక ధ్యాస పెట్టాలన్నారు. త్రాగునీరు కలుషితం కాకుండా క్లోరినేషన్ చేయడం, అవసరమైన  మందులను అన్ని పీహెచ్సీలలో అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిందన్నారు.46 మండలాల్లో 22 మండలాలు భారీ వర్షాలకు గురయ్యాయని, మిగిలిన మండలాల్లో పాక్షికంగా వర్షాలు పడ్డాయని అన్నారు. జిల్లాలో ఐదుగురు మృతి చెందారని తెలిపారు. వరి,ఉద్యాన పంటలకు సంబంధించి అంత ఎక్కువ నష్టం జరగలేదన్నారు.  జీవీఎంసీ పరిధిలో ఒక రూఫ్ కూలి పోయిన ఘటనలో  ఇద్దరు మృతిచెందారని,సంబంధిత కుటుంబీకులకుపరిహారాన్ని అందజేయడం జరిగిందన్నారు.  తొమ్మిది ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని వారికి ఈ రోజు సాయంత్రం నష్ట పరిహారాన్ని అందజేయడం జరుగతుందని తెలిపారు. జిల్లా లో  కొన్ని చోట్ల పాక్షికంగా రోడ్లు దెబ్బ తిన్నాయనీ సిబ్బంది పనులను చేపడుతున్నారని తెలిపారు.