అదుపుతప్పిన లారీ ఆటోపై పడింది..
Ens Balu
5
ఎన్ఏడీ ఫ్లై ఓవర్
2020-10-15 10:57:11
విశాఖలో ఎన్.ఏ.డీ ప్లైఓవర్ వద్ద గురువారం పెను ప్రమాదం తప్పింది. అదుపుతప్పిన లారీ.. ఆటోపై బోల్తా పడటంతో స్వల్ప గాయాలతో ఆటోలో ప్రయాణి స్తున్నవారు బయటపడ్డారు.. ఘటనకు సంబందించి కంచరపాలెం ట్రాఫీక్ పోలీసులు మాట్లాడుతూ, అచ్చుతాపురం నుంచి ఐరన్ లోడుతో వస్తున్న లారీ ఎన్.ఏ.డీ మీదుగా బిర్లాకుడలికి వెళ్లాల్సి వుంది. కానీ గురువారం వేకువ జామున రెండు గంటల ప్రాంతంలో ఎన్.ఏడీ మీదుగా పోర్టుకు వెళ్తున్న క్రమంలో ఎన్.ఏ.డీ ప్లై ఓవర్ బిర్జ్ కిందకి వచ్చే సరికి ఒక్క సారిగా అదుపుతప్పి పైకి దూసుకుపోయి అటుగా వెళ్తున్న ఆటోపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న కంచరపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.