17న వర్చువల్ అదాలత్..


Ens Balu
3
Srikakulam
2020-10-15 19:18:29

శ్రీకాకుళం జిల్లాలో వర్చువల్ లోక్ అదాలత్ ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ అధ్యక్షులు , జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ తెలిపారు. వర్చువల్ లోక్ ఆదాలత్ పై బ్యాంకు అధికారులతో జిల్లా కోర్టులో గురు వారం సమావేశం నిర్వరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్చువల్ లోక్ అదాలత్ లో సివిల్ కేసులు, చెక్ బౌన్సు కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, మోటారు ఏక్సిడెంటు కేసులు (వాహన ప్రమాద కేసులు), విడాకులు మినహా ఫ్యామిలి డిస్యూట్స్ (విడాకులు మినహా మిగిలిన కుటుంబ కలహాల కేసులు), లేబర్ అండ్ ఎంప్లాయిమెంటు కేసులు (కార్మిక, యాజమాన్య కేసులు), కాంపౌండబుల్ క్రిమినల్ కేసుల (రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు) పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని కోర్టులలో వర్చువల్ లోక్ అదాలత్ జరుగుతుందని ఆయన తెలిపారు. వర్చువల్ లోక్ అదాలత్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.