జలదిగ్బంధంలోనే నిడదఓలు సత్తమ్మతల్లి..


Ens Balu
2
Nidadavole
2020-10-17 13:39:27

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖ దేవస్థానం నిడదఓలు సత్తెమ్మతల్లి ఆలయం ఇంకా వరదనీటిలోనే ఉంది. ఇక్కడి ఎర్రకాలువ వరద నీరు ప్రవాహంతో అమ్మవారి ఆలయం నిండిపోయింది. గర్భగుడిలోని అమ్మవారి పాదాలను గంగమ్మ తాకింది. ఈ ఆలయంలో నిత్యం పండుగ భోజనాలు జరుగుతాయి. గత ఐదురోజులుగా కురుస్తున్నవర్షాలకు ఆలయం మొత్తం నీరు చేరి కొద్దికొద్దిగా ఇపుడిపుడే ఇంకుతోంది. కాకపోతే ఈ ప్రాంతం మొత్తం బురదమయంగా మారింది. అమ్మవారి ఆలయంలో నీరు చేరడంతో ఐదురోజుల నుంచి దర్శనాలు పూర్తిగా నిలిపివేశారు. నీరు మొత్తం ఇంకిపోయిన తరువాత కూడా బురద మొత్తం ఆరడానికి సుమారు మరో వారం రోజులు పట్టే అవకాశం వుంది. అమ్మవారి ఆలయంలో గర్బగుడి కాస్త కిందకి వుండటంతో అమ్మవారి ఆలయంలోకి కూడా నీరుపూర్తిగా చేరిపోయి పాదాలను తాకింది నీటిని ప్రత్యేక మోటార్లు ద్వారా బయటకు పంపిస్తున్నారు...