అనంతలో కరోనా మరణాలు జీరో..


Ens Balu
3
కలెక్టరేట్
2020-10-16 13:29:06

అనంతపురం జిల్లాలో గడచిన 24 గంటల్లో కరోనా వల్ల ఒక్క మరణం కూడా సంభవించలేదని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 24 గంటల సమయంలో కరోనా వల్ల ఒక్క మరణం కూడా జరగలేదన్నారు. ఇంతకుముందు కరోనా మరణాలు సంభవించినా, చాలా రోజుల అనంతరం జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు మరణాల సంఖ్య జీరో కావడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో కరోనా వ్యాప్తి కూడా తగ్గిందన్నారు. కోవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తుండగా, పాజిటివ్ వచ్చిన వారు త్వరగా కోలుకుని ఇళ్లకు చేరుతున్నారని, ఆ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు కరోనా మరణాలు ఒక్కటి కూడా సంభవించలేదని తెలిపారు.