వ్యవసాయానికి మంచిరోజులు..
Ens Balu
3
శ్రీకాకుళం
2020-10-16 19:43:41
వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి తొలి సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి, స్పీకర్ తమ్మినేని సీతారాంలు విచ్చాసారు. ఈ సందర్భంగా ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతు బాంధవుడు అని, వారిని ఆదుకోవడం కోసమే సలహా మండలిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా మన జిల్లా వ్యవసాయాధారిత జిల్లా అని ప్రధాన వృత్తి వ్యవసామేనని అన్నారు. ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, వ్యవసాయ, సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యత నిస్తున్నదన్నారు. వ్యవసాయ అభివృధ్ధికి విన్నూత మార్పులు తేవడం జరిగిందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా సాంకేతిక సలహాలను అందిండం జరుగుతున్నదన్నారు. వ్యవసాయానికి అదును పదును వుండాలన్నారు. సకాలంలో సాగునీరు అందించాలని, నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని అన్నారు. ప్రస్తుతం వ్యనసాయానికి అవసరమైన సమయంలో కూలీల కొరత వుందన్నారు. దీనిని అధిగమించ వలసిన ఆవశ్యకతను పునరాలోచించాలన్నారు. చెరకు పంట విస్తీర్ణతను పెంచాలన్నారు. చెరకు, అరటి పంటల నష్టాలను అధిగమించడానికి ఇన్సూరెన్సు స్కీమ్ వుందన్నారు. సలహా మండలి ద్వారా అధికారులు, వ్యవసాయదారులకు మంచి సలహాలను అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా రూపొందించాలన్నారు. శాస్త్ర సాంకేతికతను సామాన్యులకు అందించాలన్నారు. మేలైన వ్యవసాయానికి మంచిరోజులు వచ్చాయన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ, అనేక సవాళ్ళ మధ్య వ్యవసాయం చేయడం జరుగుతున్నదన్నారు. వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు ఒక శుభ సూచికమన్నారు. ముఖ్యమంత్రి అభినందనీయులని అన్నారు. జిల్లా స్థాయిలోని నిర్ణయాలను మండల స్థాయికి తీసుకు వెళ్ళాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా జవాబుదారీతనంతో వ్యవసాయం చేయడం జరుగుతుందన్నారు. సలహా మండలి ద్వారా వ్యవసాయంలోని లోటు పాట్లు, అవసరాలు , సలహాలను రైతుల నుండి తెలుసుకుని ప్రభుత్వానికి తెలియచేయడం జరుగుతుందన్నారు. రైతులు సంఘటిత శక్తిగా మారే అవకాశం వుందన్నారు. మార్కెటింగ్ సదుపాయం వంటి అంశాలపై నిర్ణయాత్మకమైన వ్యూహాలను రూపొందించుకుని సమస్యల పరిష్కార దిశగా ముందుకు సాగాలన్నారు. ఇరిగేషన్, ఎగ్రికల్చర్, అనుబంధ శాఖలు సంయుక్తంగా పని చేసి మంచి సలహాలను అందించాలని, వ్యవసాయ రంగాన్ని అభివృధ్ధి చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, వ్యవసాయంపై ప్రత్యేక శ్రధ్ధ వహిస్తున్నారన్నారు. దాని ఫలితంగానే వ్యవసాయ సలహామండలి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వానికి, రైతాంగానికి వారధిగా సలహామండలి పనిచేస్తుందన్నారు. జిల్లాలో ఈ-క్రాప్ నమోదు శతశాతం పూర్తి చేయడం జరిగిందని, వివరాలను సచివాలయాలలో వుంచడం జరిగిందని తెలిపారు. అనంతరం రైతు మిషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు గొండు రఘు రాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతు బాంధవుడని, నష్టాల ఊబి నుండి లాభాల బాట వైపు తీసుకొని రావడమే లక్ష్యంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేసి మార్కెటింగ్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రికే చెల్లిందన్నారు. డిమాండు మేరకు పంటలను వేసుకోవాలన్నారు. తక్కువ నీటితో పంటలు పండించుకునే సలహాలను అందించాలన్నారు. భవిష్యత్తులో లాభం గడించే పంటలపై అంచనాలు వేసుకోవాలని, రైతులకు పంటమార్పిడిపై అవగాహన పెంపొందించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతు శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తున్నారని తెలిపారు. రెతుల కష్టాలను తొలగించడానికి ఎనలేని కృషి చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయ వ్యవస్ధకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసారని తెలిపారు. రైతు వద్దకే విత్తనాలను, ఎరువులను అందించడం జరుగుతున్నదన్నారు. రబీలో మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించడం జరిగిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో మంచి దిగుబడి సాధించాలి. గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంత్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, దువ్వాడ శ్రీనవాస్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్, సివిల్ సప్లయిస్ డిఎం శ్రీనివాసరావు, వంశధార ఎస్.ఇ తిరుమల రావు, జలవనరుల శాఖ ఎస్ ఈ ఎస్ వి రమణ, డుమా పి.డి. కూర్మారావు, ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మోహన్ రావు, సెరికల్చర్, హార్టికల్చర్, ఏనిమల్ హస్బెండ్రీ అధికారులు, సుగర్ ఫ్యాక్టరీ ఎ.జిఎం. నియోజకవర్గ సభ్యులు ఆర్.వెంకటేశ్వరరావు, శ్రీహరిరావు, జి,అప్పలనాయుడు, కె.సంజీవరావు, జి.లక్ష్మణరావు, జి.కళావతి, కె.సూర్యనారాయణ, నరేంద్ర నాయుడు, తదితరులు పాల్గొన్నారు.